Friday, June 15, 2012

శ్రీశ్రీ వర్థంతి సభ







"ఆధునిక కవిత్వానికి ఊపిరిపోసి ఉరకలెత్తిచ్చిన కవి శ్రీశ్రీ" అని ఇండియన్ హైకూ క్లబ్ ప్రధాన కార్యదర్శి జి.బ్రహ్మాజీ అన్నారు. శారదానగర్ లోని శ్రీ సూర్యా కాన్సెప్ట్ స్కూల్ లో శుక్రవారం సాయంత్రం "ఇండియన్ హైకూ క్లబ్ " ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. తొలుత ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షులు డా.తలతోటి పృథ్వీ రాజ్ శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
     కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి అని చెప్పి నిరూపించిన కవి శ్రీశ్రీ అని మాధవీ సనారా శ్రీశ్రీని కొనియాడారు. నిడివిగల గేయాలను, కవిత్వాన్ని రాయడంలో  ప్రత్యేకత గల కవి శ్రీశ్రీ అని డా.యిమ్మిడిశెట్టి చక్రపాణి  అన్నారు. సామాన్యులలోకి శ్రీశ్రీ సాహిత్యం వెళ్ళడం వల్లే  శ్రీశ్రీని మహాకవిగా నిలబడ్డాడని ప్రమిఖ కథకులు,హైకూక్లుబ్ గౌరవ అధ్యక్షులు జి.రంగబాబు అన్నారు.
     ఈ కార్యక్రమములో శ్రీ సూర్యా కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్  , టీచర్ రామకృష్ణ, జి.ఎస్.కె.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment